VijayaKumar

Apr 25 2024, 06:52

వర్కట్ పల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో ఘనంగా పాఠశాల వార్షికోత్సవం


యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని వర్కట్ పల్లి ప్రాథమికోన్నత పాఠశాల రాత్రి 8 గంటలకు పాఠశాల వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు .ఈ కార్యక్రమంలో విద్యార్థులు అనేక సాంస్కృతిక కార్యక్రమాలు పాల్గొన్నారు . ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు హనీఫ్ అహ్మద్ మాట్లాడుతూ పాఠశాల వార్షికోత్సవం అనే కార్యక్రమం అకాడమిక్ క్యాలెండర్ లో భాగంగా నిర్వహించే కార్యక్రమం అని అన్నారు . వీటి వలన విద్యార్థుల్లో దాగివున్న సృజనాత్మకతను వెలుకి తీయవచ్చునని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మహేశ్వర్, శ్రీనివాస్ ,స్వప్న ,కిష్టయ్య ,గీతారెడ్డి ,సంతోష ,విద్యార్థులు తల్లిదండ్రులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

VijayaKumar

Apr 24 2024, 13:52

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల భారీ మెజార్టీతో గెలుపు తథ్యం :పూస బాలమణి ఎంపీపీరామన్నపేట


  భువనగిరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు యాదాద్రి లక్ష్మి నర్సింహా స్వామి వారి దీవెనలు తీసుకొని నామినేషన్ దాకాలు చేసిన శుభ సందర్బంగా వారికి శుభాకాంక్షలు అబినందనలు తెలియజేస్తూ 

nsui నాయకుని నుంచి mp గా చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ ది కష్ట పడ్డ ప్రతి కార్యకర్తకు గుర్తింపు తెచ్చే పార్టీ ఏదైనా ఉన్నదా అంటే అది కాంగ్రెస్ పార్టీ అని తెలియజేస్తున్నా 

మా రామన్నపేట మండలం లో కాంగ్రెస్ క్యాడర్ చాలా బలమైనది వేముల వీరేశం గారికి మా మండలం నుంచి అత్యధిక ఓట్ల మెజారిటీ ఇచ్చినమో అదేవిధంగా చామాలకు ఎక్కువ మెజారిటీ ఇచ్చే విధంగా మా కార్యకర్తలు నమ్మకంగా ఉన్నారు బిజెపి ది అసత్య ప్రచారలే పదేళ్లుగా అధికారంలో ఉన్న బిజెపి అభివృద్ధి చేసింది ఏమి లేదు దేశం బాగుపడాలంటే బడుగుబలహీన వర్గాలు అభివృద్ధి చెందాలంటే రాహుల్ గాంధీ గారు ప్రధానిగా ఉండాలి. గతం లో ఎంపీటీసీ గా మా గ్రామాన్ని అన్ని విధాలుగా అభిరుద్ది చేసిన మా నియోజకవర్గం నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డి కి అత్యధిక ఓట్ల మెజారిటీ ఇచ్చి గెలిపించుకుంటాం అని అన్నారు.

VijayaKumar

Apr 24 2024, 13:32

భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ మ్మెల్యేలు


భువనగిరి కలెక్టర్ కార్యాలయంలో భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారి నామినేషన్ దాఖలు కార్యక్రమంలో పాల్గోన్న భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి, ,ఆలేరు శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య ,నకిరెకల్ శాసనసభ్యులు వేముల వీరేశం ,తుంగతుర్తి శాసనసభ్యులు మందుల శామ్యూల్ . నామినేషన్ కి ముందు యాదగిరిగుట్టలో ప్రత్యేక పూజలు చేసి నామినేషన్ పత్రాలు చామల కిరణ్ కుమార్ రెడ్డి దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే లు మాట్లాడుతూ భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం నుండి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని అన్నారు.

VijayaKumar

Apr 24 2024, 07:32

వలిగొండలో పోలీసుల ఫ్లాగ్ మార్చ్

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో పార్లమెంట్ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు సాయుధ బలగాలతో దాసిరెడ్డిగూడెం రోడ్డు నుండి తొర్రూర్ క్రాస్ రోడ్ లోని అంబేద్కర్ విగ్రహం వరకు పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా చౌటుప్పల్ ఏసిపి మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ ఓటర్లు ప్రజాస్వామ్యబద్ధంగా ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేందుకు పోలీసులు రక్షణ కల్పిస్తున్నట్లు తెలిపారు ఎన్నికలపై ప్రజల్లో విశ్వాసాన్ని పెంచేందుకు కవాతులు నిర్వహిస్తున్నామన్నారు ఎన్నికల్లో ఓటర్లు ప్రలోభ పెట్టకుండా డబ్బు మద్యం ఇతర విలువైన వస్తువులు అక్రమ రవాణా జరగకుండా అడ్డుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో రామన్నపేట సిఐ వెంకటేశ్వర్లు, స్థానిక ఎస్సై డి మహేందర్ తో పాటు ప్రత్యేక సాయుధ బలగాలు, వలిగొండ పోలీసులు పాల్గొన్నారు.

VijayaKumar

Apr 23 2024, 18:58

భువనగిరి పార్లమెంట్ సిపిఎం అభ్యర్థిని గెలిపించి, పార్లమెంటుకు పంపించాలని ఇంటింటికి ప్రచారం


సిపిఎం పార్టీ పార్లమెంట్ అభ్యర్థి ఎండి జాంగిర్ ని గెలిపించాలని ఈరోజు బోనగిరి మండలం వడపర్తి గ్రామంలో ఇంటింటికి తిరిగి ప్రచారం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సిపిఎం పార్టీ మండల కార్యదర్శి దయ్యాల నరసింహ మాట్లాడుతూ గత 35 సంవత్సరాల నుండి ప్రజా ఉద్యమంలో పనిచేస్తున్న ఎండి జాంగిరి చిన్నతనం నుండి ఉపాధి హామీ కూలీల కోసం రైతుల కోసం కార్మికుల కోసం నిరుద్యోగ సమస్యలపై అదేవిధంగా కాలువల కావాలని బసాపురం రిజర్వాయర్ నుండి వడపర్తి గతంలోకి నీళ్లు తేవాలని ఎన్నో కార్యక్రమాలు చేసి ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవడం జరిగింది కావున ప్రజలందరూ ఎండి జాంగిర్ కు ఓట్లేసి భారీ మెజార్టీతో గెలిపించి పార్లమెంటుకు పంపిస్తే భువనగిరి పార్లమెంటును అభివృద్ధి పథంలో చేస్తారని నరసింహ అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి వర్గ సభ్యులు పల్లెర్ల అంజయ్య మండల కమిటీ సభ్యులు పాండాల మైసయ్య గ్రామ నాయకులు పాండాల ఆంజనేయులు మల్లేష్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

VijayaKumar

Apr 23 2024, 17:28

భువనగిరి లో వీర హనుమాన్ విజయ యాత్ర లో పాల్గొన్న ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణం విశ్వహిందూ పరిషత్ బజరంగ్దళ్ ఆధ్వర్యంలో వీర హనుమాన్ విజయత్ర బైక్ ర్యాలీ అంగరంగ వైభవంగా ఘనంగా నిర్వహించారు భువనగిరి పెరుమాండ్ల హనుమాన్ దేవాలయం దగ్గర విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు పోతనక్ రాఘవేందర్ గారు జెండా ఊపి బైక్ ర్యాలీని ప్రారంభించారు బైక్ ర్యాలీ పట్టణంలో పురవీధుల గుండా తిరిగి జగదేవపూర్ రోడ్డులో గల అంజనాద్రి హనుమాన్ దేవాలయం వద్ద ముగిసింది స్థానిక వినాయక చౌరస్తా వద్ద హిందుత్వవాది చికోటి ప్రవీణ్ హాజరై ర్యాలీని ఉద్దేశించి మాట్లాడుతూ హిందూ సమాజంపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండిస్తూ హిందూ వ్యతిరేకులు హిందూ సమాజంపై దాడి చేస్తే ఎట్టి పరిస్థితుల్లో వీరత్వం విశ్వరూపం చూపుదాం పౌరుషం పరాక్రమం ప్రదర్శించుదాం అని పిలుపునిచ్చారు హిందూ యువకులను పోరాట యోధులుగా తయారు చేయడం కోసం బజరంగ్ దళ్ నిర్వహిస్తున్న ఈ ర్యాలీ ద్వారా చైతన్యవంతులై హిందూ యువకులు గోరక్ష మతమార్పిడులు మరియు లవ్ జిహాద్ ల నుంచి హిందూ ఆడపిల్లలను సంరక్షించుకోవడం కోసం చైతన్యాన్ని పొంది ప్రతి హిందూ యువకుడు పని చేయాలని పిలుపునిచ్చారు హిందువులంటే కేవలం సౌమ్యంగా ఉండేవారు మాత్రమే కాదని హిందూ దేవతల్లాగా ఆయుధాలను చేపట్టి ధర్మాన్ని కాపాడడం కోసం దుష్ట శిక్షణ కూడా చేయడానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ తెలంగాణ సహకార్యదర్శి తోట భాను ప్రసాద్ మాట్లాడుతూ కార్యక్రమం విజయవంతం చేయడానికి కృషి చేసిన కార్యకర్తలు అందరికీ ధన్యవాదాలు తెలిపారు కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి జగదేపూర్ రోడ్డులో ర్యాలీలో పాల్గొన్నారు ర్యాలీ ముగింపు జరిగే అంజనాద్రి దేవాలయంలో ప్రత్యేక పూజ అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొని ప్రజల ఉద్దేశించి భువనగిరి పట్టణంలో ప్రతి సంవత్సరం ఘనంగా మనం ఇలా శోభాయాత్ర చేసుకుంటున్నారని ఆ శ్రీరామచంద్రుని ఆశీస్సులు అందరికీ ఉండాలని పిలుపునిచ్చారు హిందువుగా పుట్టినందుకు హిందువునని ప్రతి హిందువు గర్వపడాలని అప్పుడే ఇతర మతాలను తను గౌరవించగలడని తెలిపారు కార్యక్రమంలో బజరంగ్దళ్ జిల్లా కన్వీనర్ మేకల భాను ప్రసాద్ కో కన్వీనర్ మార్కాశ్రవణ్ కోకల సందీప్ పొన్నాల వినయ్ భువనగిరి పట్టణ కన్వీనర్ నమిలే నవీన్ భువనగిరి మండల కన్వీనర్ పిన్నపురాళ్ల రాజకుమార్ వెల్దుర్తి అవినాష్ జడల అక్షయ్ విశ్వహిందూ పరిషత్ కార్య అధ్యక్షులు పోల శ్రీనివాస్ గుప్తా ఉపాధ్యక్షులు పసుపునూరి మనోహర్ జిల్లా కోశాధికారి చామ రవీందర్ కార్యదర్శి సుక్కల శ్రీశైలం యాదవ్ పట్టణ కార్యదర్శి సాల్వేర్ వేణు జిల్లా మందిర్ అర్చక పురోహిత్ ప్రముక్ ఆకుల అనిల్ సహా కార్యదర్శి పోచంగళ్ళ బాబు జిల్లా ఉపాధ్యక్షులు బూరుగు సంతోష్ రెడ్డి యాదాద్రి ప్రఖండ అద్యక్షులు ఎరుకల అనిల్ మండల అధ్యక్షులు గుండె శ్రీరాములు సహకార దర్శి రేడ్డబోయిన బాలరాజు పూస శ్రీనివాస్ దొమ్మాటి ప్రసాద్ బింగి భరత్ సండే మయూర్ ఉడుత గణేష్ బానోతు కిట్టు శ్రవణ్ కుమార్ శ్రీరామ్ శ్రీనివాస్ చారి వల్లబోజు సతీష్ జిల్లా విశ్వహిందూ పరిషత్ బజరంగ్దళ్ ముఖ్య కార్యకర్తలు హిందూ బంధువులు తదితరులు పాల్గొన్నారు హిందూ సంగటిత శక్తి ప్రదర్శన నినాదంతో చేపట్టిన వీర హనుమాన్ విజయ యాత్రను యువకుల శక్తి ప్రదర్శనతో విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపిన విశ్వహిందూ పరిషత్ నాయకులు.

VijayaKumar

Apr 23 2024, 15:17

35 సంవత్సరాలుగా ప్రజల కోసం పోరాడుతున్న సిపిఎం అభ్యర్థి జహంగీర్ ని గెలిపించండి : సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు నారి ఐలయ్య

35 సంవత్సరాలుగా ప్రజా సమస్యల పరిష్కారమే తన ధ్యేయంగా పోరాడుతున్న ప్రజా నాయకుడు సిపిఎం భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి ఎండి జహంగీర్ కు ఓటు వేసి గెలిపించాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు నారి ఐలయ్య ఓటర్లను కోరారు

  మంగళవారం మండల పరిధిలోని వర్కట్ పల్లి గ్రామంలో సిపిఎం అభ్యర్థి జహంగీర్ గెలుపును కాంక్షిస్తూ ఇంటింటా ప్రచారాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఐలయ్య మాట్లాడుతూ గత 35 సంవత్సరాలుగా ఉన్నత చదువులు చదివిన ఉద్యోగాలు వెతుక్కోకుండా వచ్చిన ఉద్యోగాలను పక్కకు పెట్టి ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా విద్యార్థి,యువజన సమస్యలతో పాటు ప్రజా సమస్యల కోసం తన జీవితాన్ని అంకితం ఇచ్చి పనిచేస్తున్న పేదలబిడ్డ జహంగీర్ ఎన్నికల్లో పార్లమెంట్ కు పోటీ చేస్తున్నారని ప్రజలందరూ నిరంతరం ప్రజల కోసం పనిచేసే పేదల అభ్యర్థి జహంగీర్ కు ఓటు వేసి గెలిపించాలని కోరారు

   కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం వామపక్ష పార్టీల పోరాట ఫలితంగా ఏర్పడిన ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ రద్దు చేసే కుట్రలు చేస్తుందన్నారు ఈ చట్టం వల్ల పనులు లేని అనేక పేద కుటుంబాలకు ఉపాధి దొరుకుతుందని పేదల నోటికాడి ముద్దను లేకుండా చేయాలని కుట్ట చేస్తున్న బిజెపిని ఈ ఎన్నికల్లో ఓడించాలని, ఉపాధి హామీ చట్టరక్షణకై పోరాడే సిపిఎం అభ్యర్థి జహంగీర్ ను ఈ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు జహంగీర్ ఈ ప్రాంత అనేక ప్రజా సమస్యలపై పోరాటాలు నడిపారని మూసి జల కాలుష్య నివారణకై మూసి ప్రాంతంలో గోదావరి జలాల సాధనకై స్థానిక పరిశ్రమలలో స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని, భూమి లేని పేదలకు భూమి పంచాలని,ఇండ్లు,ఇండ్ల స్థలాల సాధన డిమాండ్ తో అనేక ప్రజా పోరాటాలు నిర్వహించారని గుర్తు చేశారు అందుకే ప్రజల కోసం పోరాడే అభ్యర్థిని గెలిపిస్తే నిరంతరం ప్రజల్లో ఉంటూ ప్రజల కోసం పనిచేస్తారని ఈ ఎన్నికల్లో ప్రజలందరూ ఒకసారి ఆలోచించి సిపిఎం అభ్యర్థి జహంగీర్ కు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ఈ ప్రచారంలో సిపిఎం మండల కార్యదర్శి సిర్పంగి స్వామి,సిపిఎం శాఖ కార్యదర్శి మెట్టు రవీందర్ రెడ్డి,సిపిఎం నాయకులు మాజీ ఉపసర్పంచ్ లు ఆకుల మారయ్య,మాడుగుల వెంకటేశం,సీనియర్ నాయకులు చేగురి నర్సింహా,సిపిఎం సహాయ కార్యదర్శి రొండి మల్లేశం, ఎస్ఎఫ్ఐ మండల ఉపాధ్యక్షుడు వేముల జ్యోతిబసు,తదితరులు పాల్గొన్నారు.

VijayaKumar

Apr 22 2024, 23:43

ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి; వల్దాస్ రాజ్ కాళ భైరవ కిసాన్ మోర్చా యాదాద్రి భువనగిరి జిల్లా సెక్రటరీ

భువనగిరి మండల్ కిసాన్ మోర్చ మండల అధ్యక్షుడు మనిక్యం రెడ్డి ఆధ్వర్యంలో కిసాన్ మోర్చ జిల్లా సెక్రటరీ వల్దాస్ రాజ్ కాళభైరవ భస్వాపురం,వడపర్తి,హన్మపురం గ్రామాల ఐకేపీ సెంటర్లని సందర్శించడం జరిగింది.

ఆయన మాట్లాడుతూ ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చెయ్యలన్నారు. పంటవేసినంక చేతికొచ్చెదాక ఓక ఎత్తు అయితే చేతికివచ్చినంక ఐకేపీ సెంటర్ లలో ధాన్యం కొనుగోలు చెయ్యడం ఓక ఎత్తు అయిందన్నారు. వర్షాలు పడే సూచనలు వస్తున్నాయి. ఐకేపి సెంటర్ లో ధాన్యం తడిచి పోయే పరిస్థితి ఉంది కాబట్టి వెంటనే కొనుగోలు చెయ్యలని ప్రభుత్వాలు మారినా రైతుల తలరాతలు మారుతలేవన్నారు. గత ప్రభుత్వం ఇలానే చేస్తే ప్రజలు, రైతులు ఆ ప్రభుత్వాన్ని ఏక్కడ ఉంచారో గత అసెంబ్లీ ఎన్నికల్లో చూశారన్నారు. వెంటనే ఐకేపీ సెంటర్ లో ధాన్యం కొనుగోలు చెయ్యాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. రైతులకు అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు 

రెండు లక్షల రూపాయలు రుణమాఫీ, రైతు భరోసా క్రింద 15000,రైతు కూలీలకు 12000,కౌలు రైతులకు 15000 ఇస్తామని వంద రోజు ల్లో ఇస్తామనీ చెప్పి అధికారం చేపట్టిన ఈ ప్రభుత్వం ఆ హామీలను గాలికి వదిలేసి తప్పుడు మటాలతో ప్రజలలోకీ వస్తున్నారన్నారు. ఈ ఎలక్షన్ లో మాట తప్పిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓట్లతో తగిన బుద్ధి చెప్పాలన్నారు. ఈ నెల 23 తారీఖు నా భువనగిరి MP బీజేపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ గారి నామినేషన్ భువనగిరి లో ర్యాలీ ఉన్నందున అత్యధికంగా రైతులు, ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు చిర్క సురేష్ రెడ్డి గారు, జిల్లా కిసాన్ మోర్చ సోషల్ మీడియా కుషంగల ప్రభాకర్,మండల ప్రధాన కార్యదర్శి అనిల్ గారు, కిసాన్ మోర్చ మండల ఉపాధ్యక్షులు బబ్బురి సురేష్, మండల్ కిసాన్ మోర్చ సెక్రటరీ ఏడ్ల చంద్రశేఖర్, కిసాన్ మోర్చ మండల నాయకులు పిన్నం నారాయణ,మండల నాయకులు పిన్నం గనేష్,కడారి వెంకటేష్,అన్నెపు బాను తదితరులు పాల్గొన్నారు.

VijayaKumar

Apr 22 2024, 23:32

సిపిఎం అభ్యర్థి ఎండి జహంగీర్ ని గెలిపించండి:

          

  ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటాలు నిర్వహిస్తున్న సిపిఎం అభ్యర్థి అత్యధిక ఓట్లు వేసి గెలిపించాలని సిపిఎం మండల కార్యదర్శి దయ్యాల నరసింహ పిలుపునిచ్చారు. సోమవారం బోనగిరి మండల పరిధిలోని నందనం, ముస్తాలపల్లి గ్రామాలలో సిపిఎం అభ్యర్థి గెలుపును కోరుతూ ఇంటింటికి ప్రచారం చేయడం జరిగింది. ఈసంర్భంగా నర్సింహ మాట్లాడుతూ సిపిఎం ఆధ్వర్యంలో అనేక కూలీ భూమి పోరాటాలు కార్మికుల కర్షకుల హక్కుల కోసం అనేక సమరశీల పోరాటాలు సిపిఎం ఆధ్వర్యంలో నిర్వహించామని నిరంతరం రైతులు ప్రజలు వ్యవసాయ కూలీలు సంఘటిత అసంఘటిత కార్మికుల పక్షాన సిపిఎం అభ్యర్థి అనేక ఉద్యమాలు నిర్వహిస్తున్న పరిస్థితి ఉన్నదని తెలియజేశారు. సిపిఎం అభ్యర్థి జహంగీర్ గెలిస్తే ఈ ప్రాంతాన్ని విద్య వైద్యం ఉపాధి పరంగా ముందు భాగంలో పెట్టడానికి కృషి చేస్తాడని ప్రజలందరూ ప్రజల పక్షాన ప్రజల మధ్యన ఉండే జహంగీర్ ని గెలిపించాలని వారు కోరినారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి వర్గ సభ్యులు పల్లెర్ల అంజయ్య, మండల కమిటీ సభ్యులు కొండపురం యాదగిరి, నాయకులు కళ్లెం లక్ష్మీ నరసయ్య, భూపాల్ రెడ్డి, లచ్చిరెడ్డి, సిద్ధిరాములు తదితరులు పాల్గొన్నారు.

        

VijayaKumar

Apr 22 2024, 15:55

భువనగిరి మండలంలో పలు గ్రామాల్లో ఐకెపి సెంటర్ లను సందర్శించిన మండల కిసాన్ మోర్చానాయకులు

వల్దాస్ రాజ్ కాళభైరవ

కిసాన్ మోర్చ జిల్లా సెక్రటరీ

భువనగిరి మండల్ కిసాన్ మోర్చ మండల అధ్యక్షుడు మనిక్యం రెడ్డి ఆధ్వర్యంలో కిసాన్ మోర్చ జిల్లా సెక్రటరీ వల్దాస్ రాజ్ కాళభైరవ భస్వాపురం,వడపర్తి,హన్మపురం గ్రామాల ఐకేపీ సెంటర్లని సందర్శించడం జరిగింది.

ఆయన మాట్లాడుతూ ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చెయ్యలన్నారు. పంటవేసినంక చేతికొచ్చెదాక ఓక ఎత్తు అయితే చేతికివచ్చినంక ఐకేపీ సెంటర్ లలో ధాన్యం కొనుగోలు చెయ్యడం ఓక ఎత్తు అయిందన్నారు. వర్షాలు పడే సూచనలు వస్తున్నాయి. ఐకేపి సెంటర్ లో ధాన్యం తడిచి పోయే పరిస్థితి ఉంది కాబట్టి వెంటనే కొనుగోలు చెయ్యలని ప్రభుత్వాలు మారినా రైతుల తలరాతలు మారుతలేవన్నారు. గత ప్రభుత్వం ఇలానే చేస్తే ప్రజలు, రైతులు ఆ ప్రభుత్వాన్ని ఏక్కడ ఉంచారో గత అసెంబ్లీ ఎన్నికల్లో చూశారన్నారు. వెంటనే ఐకేపీ సెంటర్ లో ధాన్యం కొనుగోలు చెయ్యాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.

రైతులకు అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు 

రెండు లక్షల రూపాయలు రుణమాఫీ, రైతు భరోసా క్రింద 15000,రైతు కూలీలకు 12000,కౌలు రైతులకు 15000 ఇస్తామని వంద రోజు ల్లో ఇస్తామనీ చెప్పి అధికారం చేపట్టిన ఈ ప్రభుత్వం ఆ హామీలను గాలికి వదిలేసి తప్పుడు మటాలతో ప్రజలలోకీ వస్తున్నారన్నారు. ఈ ఎలక్షన్ లో మాట తప్పిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓట్లతో తగిన బుద్ధి చెప్పాలన్నారు. ఈ నెల 23 తారీఖు నా భువనగిరి MP బీజేపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ గారి నామినేషన్ భువనగిరి లో ర్యాలీ ఉన్నందున అత్యధికంగా రైతులు, ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు చిర్క సురేష్ రెడ్డి గారు, జిల్లా కిసాన్ మోర్చ సోషల్ మీడియా కుషంగల ప్రభాకర్,మండల ప్రధాన కార్యదర్శి అనిల్ గారు, కిసాన్ మోర్చ మండల ఉపాధ్యక్షులు బబ్బురి సురేష్, మండల్ కిసాన్ మోర్చ సెక్రటరీ ఏడ్ల చంద్రశేఖర్, కిసాన్ మోర్చ మండల నాయకులు పిన్నం నారాయణ,మండల నాయకులు పిన్నం గనేష్,కడారి వెంకటేష్,అన్నెపు బాను తదితరులు పాల్గొన్నారు.